Saturday, May 4, 2024

అంతర్జాతీయ కుట్రలో భాగంగా జరుగుతోంది: కంగనా రనౌత్

బాలీవుడ్ వివాదస్పద నటీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆఫ్గనిస్తాన్ ని ఆక్రమించిన తాలిబన్ల విషయమై ఆమే స్పందించింది. తాను తాలిబన్ల గురించి షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, చైనాకు చెందినవారు తన ఇన్‌స్టా ఖాతాను హ్యాక్‌ చేసినట్లు అలర్ట్‌ వచ్చిందని తెలిపింది. దీంతో నిర్వహాకులకు ఫిర్యాదు చేయడంతో తన ఇన్‌స్టా అకౌంట్ ను తిరిగిపొందానని పేర్కొంది. అయితే తాలిబన్లపై మాత్రమే కాకుండా.. ఏ పోస్ట్ చేద్దామనుకున్న లాగ్‌ అవుట్‌ అవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె సిస్టర్ సెల్ లో తన అకౌంట్ లాగిన్ అయ్యి పోస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇదంత చూస్తుంటే అంతర్జాతీయ కుట్రలో భాగం అనిపిస్తుందని’ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

ఇది కూడా చదవండి: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న 87వేల మందికి కరోనా పాజిటివ్

Advertisement

తాజా వార్తలు

Advertisement