Friday, May 17, 2024

క‌డ‌పలో ప‌ర్య‌టించ‌నున్న – సీఎం జ‌గ‌న్

క‌డ‌ప‌లో ప‌ర్య‌టించ‌నున్నారు సీఎం జ‌గ‌న్. రేపు ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకుని… రెండు గంటల పాటు పులివెందుల మున్సిపాలిటీ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు వేంపల్లికి చేరుకుంటారు. అక్కడ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ కు చేరుకుని, ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తారు. అనంతరం విజయవాడకు తిరుగుపయనమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement