Friday, May 3, 2024

Kabbadi – మ‌న క‌బడ్డీ కూత‌కు ఎనిమిదోసారి అసియా ఛాంపియ‌న్ షిప్ …

బుసాన్ – దేశ గ్రామీణ క్రీడ క‌బ‌డ్డీ ఇప్పుడు విదేశాల‌లో సైతం కేక పుట్టిస్తున్న‌ది.. మ‌న దేశ కబ‌డ్డీ శిక్ష‌కుల‌తో విదేశీయులు శిక్ష‌ణ తీసుకుంటూ మ‌న‌కే స‌వాల్ విసురుతున్నారు.. ముఖ్యంగా ఇరాన్ క‌బ‌డ్డీ లో బ‌ల‌మైన జ‌ట్టుగా పేరు సంపాదించింది.. తాజాగా జరిగిన ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ లో ఇరాన్ ను చిత్తు చేసి భారత్ విజేతగా నిలిచింది. తొమ్మిది ఎడిషన్లలో మన జట్టు ఎనిమిదోసారి ట్రోఫీ నెగ్గింది.

కొరియాలోని బుసాన్ లో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 42-32తో ఇరాన్‌ను చిత్తుగా ఓడించింది. భారత కెప్టెన్ పవన్ సెహ్రావత్ సూపర్- 10తో సత్తా చాటాడు. అంతకుముందు జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 64-20తో హాంకాంగ్‌ను ఓడించింది. దాంతో టోర్నీ లీగ్ దశను అజేయంగా ముగించింది. ఈ మెగా టోర్నీలో భారత్, ఇరాన్, జపాన్, కొరియా, చైనీస్ తైపీ, హాంకాంగ్ జట్లు పోటీ పడ్డాయి. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇరాన్ రెండో స్థానంలో నిలిచి భారత్ తో ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న భారత్ సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొననుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement