Sunday, April 28, 2024

కరీంనగర్ పర్యటనకు రానున్న‌ జస్టిస్ ఈవీ వేణుగోపాల్.. తాను చ‌దివిన స్కూల్‌కే చీఫ్ గెస్ట్‌గా

తెలంగాణ‌ హైకోర్టు న్యాయమూర్తి ఈవీ వేణుగోపాల్ రేపు (శనివారం) కరీంనగర్ లో పర్యటించనున్నారు. నగరంలోని సెయింట్ జాన్స్ పాఠశాల 60వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఇ.వి. వేణు గోపాల్ హాజరు కానున్నారు. ఇదే పాఠశాల పూర్వ విద్యార్థిగా చదివి నేడు హైకోర్టు జడ్జిగా హాజరువుతున్నారు.

సెయింట్ జాన్స్ పాఠశాలలో గత సంవత్సరం సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు స్వీకరించి మొదటిసారి కరీంనగర్ వచ్చిన సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement