Monday, May 6, 2024

INDvsAUS – T20 | దంచికొట్టిన ఇంగ్లిస్‌, స్మిత్.. భార‌త్ ముందు భారీ టార్గెట్

విశాఖ వేధికగా జ‌రగుతున్న భారత్‌- ఆసిసీ తొలి టీ-20 పోరులో… ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు రెచ్చిపోయి ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆసిసీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్ లో డేంజ‌రస్ మాథ్యూ షార్ట్ (13) ప‌వ‌ర్ ప్లేలో ఔట్ అయ్యాడు.

ఆ త‌రువాత వ‌చ్చిన జోష్ ఇంగ్లిస్‌(110) సెంచ‌రీతో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. మ‌రోవైపు స్టీవ్ స్మిత్(52) హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ లు దంచికొట్టడంతో ఆసీస్ స్కోర్ భారీగా వెళ్లింది. కాగా, టీమిండియా విజ‌య ల‌క్ష్యం చేరుకోవాలంటే నిర్ణీత ఓవ‌ర్ల‌లో 209 ప‌రుగులు చేయాల్సి ఉంది.

ఇక భార‌త బౌల‌ర్ల‌లో యువ స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ త‌న తొలిఓవ‌ర్లోనే భార‌త్‌కు తొలి వికెట్ అందించాడు. ప్రసిధ్ కృష్ణ ఒక్క వికెట్ ద‌క్కించుకున్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement