Monday, April 29, 2024

6న ఉమ్మడి పీజీ ఎంట్రన్స్‌ నోటిఫికేషన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 6న ఉమ్మడి పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీపీగెట్‌)-2022 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు సీపీగెట్‌ కన్వీనర్‌ ప్రొ.ఐ.పాండురంగా రెడ్డి తెలిపారు. మాసాబ్‌ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలిలో మధ్యాహ్నం 3 గంటలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు అందించే ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయు వర్సిటీల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement