Friday, May 3, 2024

Jharkhand: ఇవాళ ఝ‌ర్ఖండ్ బ‌ల‌ప‌రీక్ష‌…

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో నేడు అధికార జేఎమ్ఎమ్ పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్ తరువాత చంపయి సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రిసార్ట్ పాలిటిక్స్​కు తెరలేపిన అధికార జేఎమ్ఎమ్ పార్టీ హైదరాబాద్​లోని ఓ హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలను బలపరీక్ష కోసం రాష్ట్ర రాజధాని రాంచీకి రప్పించింది. అయితే, అధికార పార్టీకి ఉన్న మెజారిటీ దష్ట్యా విజయం లాంఛనమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసాధారణ ఘటనలు ఏమైనా జరిగితే తప్ప జేఎమ్ఎమ్ మళ్లీ ఝార్ఖండ్‌లో అధికారం చేజిక్కించుకుంటుందని పరిశీలకులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement