Friday, May 3, 2024

ఏపీలో రోడ్లు బాగుచేయాలంటూ జనసైనికుల ఉద్యమం

ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. అయినా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై పలువురు జన సైనికులు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు.

జనసేన పార్టీకి చెందిన పలువురు తమ ప్రాంతంలోని రోడ్లను ఫొటో తీసి, ఏరియా పేరుతో #JSPForAP_Roads అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టి ట్వీట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ సీపీ సర్కారును ప్రశ్నించాలని, రోడ్లు బాగు చేసే వరకు పోరాడాలని చెబుతున్నారు. పన్నులు కడుతున్నామని, సర్కారు చేత రోడ్లు బాగు చేయించుకునే హక్కు అందరికీ ఉందని జనసేన నేతలు ట్వీట్లు చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: మళ్లీ వేడెక్కుతున్న తాడిపత్రి రాజకీయాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement