Saturday, May 4, 2024

big accident: జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు… త‌ప్పిన పెను ప్ర‌మాదం

న్యూఢిల్లీః భువనేశ్వర్‌ – హౌరా జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తు వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్‌ నుంచి హౌరా వెళ్తున్న జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కటక్‌ చేరుకోగానే మంటలు చెలరేగాయి. కోచ్‌ దిగువ భాగం నుంచి పొగలు వెలువడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. అనంతరం రైలు 7:15కి కటక్‌ నుంచి బయలుదేరి వెళ్లినట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement