Wednesday, May 15, 2024

Jana Sena – ప్ర‌శ్నిస్తే చంపేస్తారా …. జ‌గ‌న్ ను నిల‌దీసిన ప‌వ‌న్

విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై న్యాయ పోరాటం చేస్తున్న తమ పార్టీ కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ను చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం వైఖరిని తెలియజేస్తుందని అన్నారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌. ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని పాలకులు, వారి అనుయాయులు న్యాయ పోరాటాలను తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే ప్రాణహానికి తలపెట్టారని ఆరోపించారు. అందుకే మూర్తికి అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.. కాగా,మూర్తికి ఏ విధ‌మైన హాని జ‌రిగినా ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని కోరారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement