Monday, April 29, 2024

IPL | చెలరేగిన జైస్వాల్.. కోల్‌కతాని చిత్తుగా ఓడించింది రాజస్థాన్

ఇవ్వాల్టి మ్యాచ్ లో సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది రాజస్థాన్. 150 పరుగుల టార్గెట్ ను కేవలం 13.1 ఓవర్లలోనే ఫినిష్ చేశారు రజస్థాన్ బ్యాటర్లు. దీంతో.. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది రాజస్థాన్. యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 98 పరుగుతో (13 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం అంటే ఏంటో కేకేఆర్ కు రుచి చూపించాడు. సంజూ శాంసన్ 29 బంతుల్లో 48 పరుగులతో (2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విక్టరీతో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement