Friday, April 26, 2024

జ‌గ‌న్ మ‌రో కొత్త కార్య‌క్ర‌మం ‘జగనన్నకు చెబుదాం’

తాడేప‌ల్లి: ప్ర‌జ‌ల‌కు పార్టీ, ప్ర‌భుత్వం మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతున్నారు.. ఈ కార్య‌క్ర‌మానికి ‘జగనన్నకు చెబుదాం’ అనే పేరుని ఖరారు చేశారు. ఈ కార్యక్రమం సన్నాహకాలపై సీఎం వైయస్‌.జగన్ ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సమీక్ష నిర్వ‌హించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. .

వినతులను సంతృప్తస్థాయిలో పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమ‌ని తెలిపారు స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సీఎం సమీక్షించారు. అర్జీల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్రంగా చ‌ర్చించారు. త్వ‌ర‌లో చేప‌ట్ట‌బోయే జ‌గ‌న‌న్నకు చెబుదాం కార్య‌క్ర‌మ విధి విధానాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement