Monday, May 6, 2024

భారత్ తో ఐర్లాండ్ టీ20 పోరు.. జట్ల వివరాలివే !

భారత్‌తో టీ20 సిరీస్‌ కోసం ఐర్లాండ్‌ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. భారత్‌-ఇర్లాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆగస్టు 18 నుంచి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించగా.. తాజాగా శుక్రవారం ఐర్లాండ్‌ కూడా తమ జట్టును ప్రకటించింది. 2024 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నేపథ్యంలో ఐర్లాండ్‌ పటిష్టమైన జట్టును ఎంపిక చేసింది.

పాల్‌ స్టిర్లింగ్‌కు సారథ్య బాద్యతలు అప్పగించింది. ఆల్‌రౌండర్లు గార్ట్‌ డెలాని, ఫియోన్‌ హ్యాండ్‌కు తిరిగి జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్‌కు భారత జట్టుకు జస్ప్రీత్‌ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. టీమిండియాలో తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, యశస్వి జైస్వాల్‌లకు చోటు దక్కింది.

ఐర్లాండ్‌ జట్టు: పాల్‌ స్టిర్లింగ్‌ (కెప్టెన్‌), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్‌ అడైర్‌; రాస్‌ అడైర్‌, కర్టిస్‌ క్యాంఫర్‌, గార్ట్‌ డెలాని, జార్జ్‌ డాక్రెల్‌, ఫియోన్‌, హ్యాండ్స్‌, జోష్‌ లిటిల్‌, బ్యారి మెక్‌కార్తీ, హ్యారి టెక్టర్‌, లోర్కాన్‌ టక్కర్‌; థియో వాన్‌, బెన్‌ వైట్‌, క్రెయిగ్‌ యంగ్‌.

భారత జట్టు: జస్ప్రీత్‌ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, సంజూ సంసన్‌, నితేష్‌ శర్మ, శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోయ్‌, ప్రసిద్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేశ్‌ కుమార్‌, అవేష్‌ ఖాన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement