Friday, May 17, 2024

ఫిబ్రవరిలో ఐపీఎల్‌ మెగా వేలం… ఎక్క‌డ జ‌రుగుతుందంటే..

ఐపీఎల్‌ మెగా వేలాన్ని బీసీసీఐ రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు సమాచారం. 2022 ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కరోనా కారణంగా ఈ మెగా వేలానికి భారత్‌ వేదిక అవుతున్నట్టు సమాచారం. బెంగళూరులో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సన్నాహాలు ప్రారంభించినట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

యూఏఈలో వేలం ఉంటుందని కొందరు చెబుతుండగా.. కరోనా కారణంగా స్థానికంగానే ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. వచ్చే ఏడాది 10 జట్లు బరిలోకి దిగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement