Sunday, April 28, 2024

ఉప్పల్ వేదికగా నేడు IPL మ్యాచ్.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

నేడు హైదరాబాద్‌ వర్సెస్‌ పంజాబ్‌ మ్యాచ్‌ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ ఓడిపోయింది. ఈసారైనా గెలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఉప్పల్తో పాటు వరంగల్ రహదారిపై కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ దృష్ట్యా, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఉంటాయని రాచకొండ పోలీసులు తెలిపారు. ఉప్పల్ స్టేడియానికి వచ్చే నాలుగు ప్రధాన మార్గాల్లో వాహనాలను అనుమతిస్తామన్నారు. అయితే భారీ వాహనాలకు మాత్రం ఉప్పల్ స్డేడియం వైపు అనుమతి లేదని తెలిపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 11:30 గంటల మధ్య కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. వరంగల్ హైవే నుంచి చెంగిచెర్ల వైపు వెళ్లే వాహనాలను చెంగిచెర్ల ఎక్స్ రోడ్డు–చెర్లపల్లి–ఐఓసీఎల్–ఎన్‌ఎఫ్‌సీ రోడ్డు వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఎల్‌బీనగర్‌ నుంచి నాగోల్‌ వైపు వెళ్లే ఈ వాహనాలను.. నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వైపు నుంచి హెచ్‌ఎండీఏ–బోడుప్పల్‌–చెంగిచెర్ల ఎక్స్‌ రోడ్డు మీదుగా, మల్లాపూర్‌ నుంచి నాచారం ఐడీఏ వైపు వెళ్లే భారీ వాహనాలను.. నాచారం ఐడీఏ నుంచి చెర్లపల్లి–చెంగిచెర్ల మీదుగా మళ్లించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement