Monday, April 29, 2024

రేప‌టి నుంచే స‌ఫారీల‌తో భారత్ టీ-20 మ్మాచ్.. పూర్తి ష్య‌డ్యూల్ ఇదే..!

వ‌రుస సిరీస్‌ల‌లో విజ‌యంతో దూకుడు మీద ఉన్న భార‌త క్రికెట్ జ‌ట్టు… రేప‌టి నుంచి (సెప్టెంబర్ 28) అక్టోబర్‌ 4 మధ్య తిరువనంతపురం, గౌహతి, ఇండోర్‌లలో మూడు టి 20 ఇంటర్‌నేషనల్‌లకు భారత దేశం దక్షిణాఫ్రికాకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్ప‌టికే ఇరు దేశాల జ‌ట్లు తిరువ‌నంత‌పురం చేరుకున్నాయి. రేపు గ్రీన్ ఫీల్డ్ ఇంట‌ర్నేష‌నల్ స్టేడియంలో రాత్రి 7 గంట‌ల‌కు తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కాగా, అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 ప్రపంచకప్‌కు ముందు ఇరుజట్లకు ఇవి చివరి టీ-20 అసైన్‌మెంట్లు అని చెప్పవచ్చు. ఇక, భారత్, దక్షిణాఫ్రికా అక్టోబర్‌ 6, 9, 11 తేదీల్లో లక్నో, రాంచి, ఢిల్లిలో మూడు వన్‌డేసిరీస్‌ ఆడనున్నాయి.

సెప్టెంబర్‌ 28: భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా 1 టీ 20
గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం, తిరువనంతపురం

అక్టోబర్‌ 2: భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా 2 టీ 20
బర్సపరా క్రికెట్‌ స్టేడియం, గౌహతి

అక్టోబర్‌ 4: భారత్‌ సౌతాఫ్రికా 3 టీ20
హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియం, ఇండోర్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement