Friday, April 26, 2024

ఏడేళ్ల తర్వాత తెలుపు రంగు జెర్సీలో..

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత టెస్టు ఆడేందుకు టీమ్​ఇండియా ఉమెన్స్ టీమ్ సిద్ధమైంది. ఈ ఏడాది జూన్​లో ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనున్న మన అమ్మాయిలు.. టెస్టుతో టూర్‌ను ప్రారంభించనున్నారు. దీంతో పాటే వన్డేలు, టీ20ల్లోనూ తలపడనున్నారు. భారత మహిళలు 2014లో చివరగా టెస్టు ఆడారు.

జూన్ 16-19 మధ్య భారత్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు ఏకైక టెస్టు ఆడనున్నారు. బ్రిస్టల్ కంట్రీ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. జూన్ 27, 30, జులై 3 తేదీల్లో మూడు వన్డేలు.. జులై 9, 11, 15 తేదీల్లో మూడు టీ20లలో ఇరు జట్లు తలపడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement