Tuesday, April 30, 2024

ఉక్రెయిన్​లో చనిపోయిన భారతీయ విద్యార్థి.. బెంగళూరుకు నవీన్‌ భౌతికకాయం..  

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్‌ శేఖరప్ప జ్ఞానగౌడర్‌ మృతదే#హం స్వదేశానికి చేరుకున్నది. సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో నవీన్‌ భౌతికకాయం బెంగళూరుకు వచ్చింది. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న నవీన్‌.. మార్చి 1న ఖార్కీవ్‌లో జరిగిన పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అతని మృతదేహాన్ని పరిశోధనల కోసం దేవనాగరెలోని ఎస్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీకి దానం చేయనున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో నవీన్‌ పార్థివదేహానికి కర్ణాటక సీఎం బసవరాజ్‌బొమ్మై నివాళులు అర్పించారు. నవీన్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు వీలుగా అతని భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement