Tuesday, April 30, 2024

Indian crew | ఇజ్రాయెల్ నౌకలో 17 మంది భార‌తీయులు.. ఒక్కరి విడుద‌ల

ఇజ్రాయెల్ కు చెందిన నౌకను ఇరాన్ మిలిటరీ ముట్టడించిన సంగతి తెలిసిందే. అందులో చిక్కుకున్న నేవీ బృందంలో 17 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు. వీరిలో అన్ టెస్సా జోసెఫ్ అనే ఏకైక మ‌హిళ‌ నావికురాలిని గురువారం విడుదల చేశారు. ఇరాన్ ప్రభుత్వంతో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం జరిపిన సంప్రదింపుల ఫలితంగా మార్గం సుగమమైంది.

కేరళలోని త్రిసూర్‌కు చెందిన జోసెఫ్ గురువారం మధ్యాహ్నం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి స్వాగతం పలికారు. మిగిలిన 16 మంది భారతీయ నావికుల విడుదల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వారంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement