Sunday, May 5, 2024

ఆసియ‌న్ హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో దూసుకుపోతున్నఇండియా.. వ‌రుస‌గా రెండు జ‌ట్ల‌పై ఘ‌న విజ‌యం

మెన్స్ ఆసియన్‌ హాకీ 5ఎస్‌ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో భారత పురుషుల జట్టు.. నిన్న బంగ్లాదేశ్‌పై 15-1 తేడాతో ఘ‌న విజ‌యం సాదించింది. ఆ త‌ర్వాత టోర్నీలో ఇవ్వాల (బుద‌వారం) జ‌రిగిన రెండో మ్యాచ్ లోనూ ఆతిథ్య జ‌ట్టు ఓమన్ పై ఘ‌న విజ‌యం సాదించింది. ఈ మ్యాచ్ లో 12-2 స్కోర్ తో ఒమ‌న్ ని భార‌త్ చిత్తుగా ఓడించింది.

ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ లో మొద‌టి నుంచి ఫుల్ అటాకింగ్ తో సాగిన భార‌త్.. మొదటి అర్ధభాగం ముగిసేస‌రికి 5-0 స్కోర్ తో ఆధిక్యంలో నిలిచింది. ఇక‌ సెకండాఫ్‌లోనూ అదే జోరు క‌న‌బ‌రిచిన భార‌త ఆట‌గాళ్లు పాయింట్ల వేట‌ను కొన‌సాగించారు. సెకండ్ హాఫ్ లో ఒమ‌న్ జ‌ట్టు రెండు గోల్స్ చేసిన‌ప్ప‌టికీ.. భార‌త జట్టు వెన‌క‌డుగు వేయ‌లేదు. దీంతో ఆతిథ్య జ్ట‌టు అయిన ఒమ‌న్ ని 12-2 స్కొర్ తేడాతో గెలిచి గేమ్ ని ద‌క్కించుంది.

- Advertisement -

కాగా, ఇవ్వాల రాత్రి 9.30 గంట‌ల‌కు ఎలీట్ గ్రూప్ లో పాకిస్థాన్‌లతో పోటీపడ‌నుంది భారత్. ఆపై ఆగస్టు రేపే (గురువారం) మలేషియా, జపాన్‌లతో తలపడనుంది. కాగా, వ‌చ్చే ఏదాది (2024) హాకీ 5s ప్రపంచ కప్‌లో మొత్తం 16 దేశాలు పోటీ పడనుండ‌గా.. ఆ గ్లోబల్ ఈవెంట్‌లో స్థానం పొందాలంటే.. ప్ర‌స్తుతం జ‌రుగున్న టోర్నీలో భారత్ మొదటి మూడు స్థానాల్లో చేరాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement