Friday, May 3, 2024

రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై జాతీయ పతకం ఆవిష్కరణ

దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్‌ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ఫ్రంట్‌ లైన్‌ వారియార్స్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమానికి సీఎస్‌ సోమేష్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి హాజరయ్యారు. పోలీసులకు ఉత్తమ సేవా అవార్డులను ప్రధానం చేసారు గవర్నర్‌ తమిళిసై. అలాగే రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తమిళిసై.

Advertisement

తాజా వార్తలు

Advertisement