Friday, May 17, 2024

మాజీ సీపీ కుమారుడి కేసులో… మాజీ మంత్రి షబ్బీర్ అలీపై కేసు

హైదరాబాద్ మాజీ సీపీ ఏకే ఖాన్ కుమారుడి కేసులో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఇసుక తవ్వకాల పేరుతో రూ.90లక్షలు తీసుకున్నారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. 2016లో మోసిన్ ఖాన్ కు డబ్బులిచ్చానని బాధితుడు తెలిపాడు.కోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మోసిన్ ఖాన్, తండ్రి ఏకే ఖాన్, మామ (మాజీ మంత్రి) షబ్బీర్ అలీపై కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదుదారుడి నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. డబ్బు లావాదేవీలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement