Thursday, May 9, 2024

Breaking: జ‌మ్ము కాశ్మీర్‌లో పేలుళ్లు.. బ‌స్సుల్లోని ప్ర‌యాణికులే టార్గెట్‌!

జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్‌లో రెండు చోట్ల పేలుళ్లు జ‌రిగాయి. పాత బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో గురువారం తెల్లవారుజామున మరో మిస్టరీ పేలుడు సంభవించింది. గత 8 గంటల్లో ఇలాంటి పేలుడు సంభవించడం ఇది రెండోసారి. అయితే.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదు. J&K పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఇక‌.. బుధవారం రాత్రి 10:45 గంటల సమయంలో డొమైల్ చౌక్ వద్ద బస్సులో అనుమానాస్పద పేలుడు సంభవించింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గత రాత్రి పేలుడు జరిగిన ప్రాంతానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఇవ్వాల రెండో పేలుడు జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement