Wednesday, May 1, 2024

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాపర్స్‌ బాలురే.. ఫలితాలు ప్రకటించిన ఐఐటీ బాంబే

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 ఫలితాలను ఐఐటీ బాంబే ఆదివారం ప్రకటించింది. జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను ప్రకటించిన ఐఐటీ బాంబే, ఆన్సర్‌ కీలను సైతం అదే వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ప్రకటించింది. ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ఆర్‌.కె.శిశిర్‌ జేఈఈ అడ్వాన్స్‌ టాపర్స్‌ మొదటి ర్యాంక్‌ను సాధించారు. 360 మార్కులకు గాను శిశిర్‌ 314 మార్కులతో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు.

బాలికల విభాగంలో ఐఐటీ ఢిల్లి జోన్‌ అభ్యర్థి తనిష్క కబ్రా 277 మార్కులతో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. కామన్‌ ర్యాంక్‌ లిస్ట్‌ ప్రకారం మొదటి పది ర్యాంక్‌లు సాధించిన టాపర్స్‌ ఆర్‌కె శిశిర్‌, పోలు లక్ష్మీ సాయి లోహిత్‌ రెడ్డి, థామస్‌ బిజు చీరామ్‌వెలిల్‌, వంగపల్లి సాయి సిద్ధార్థ, మయాంక్‌ మోత్వని, పోలిశెట్టి కార్తికేయ, ప్రతీక్‌ సాహూ, ధీరజ్‌ కురుకుండ, మహిత్‌ గధివాలా, వెచ్చా జ్ఞానమహేష్‌లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement