Thursday, May 2, 2024

BRS : సునితా లక్ష్మారెడ్డి గెలిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి.. హరీశ్ రావు

సునితా లక్ష్మారెడ్డి గెలిస్తే నర్సాపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. నర్సాపూర్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నామినేషన్ ర్యాలీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్నారు. సంక్షేమ ఫలాలను అందరికి పంచేలా చూశారన్నారు. పదకొండు సార్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే ఏమీ చేయలేదన్నారు. బీజేపీకి ఒకటే సీటు వచ్చిందని ఈసారి డిపాజిట్లు కూడా రావన్నారు.

బీజేపీ డక్ అవుట్, కాంగ్రెస్‌ రన్ అవుట్‌ అయితే, కేసీఆర్‌ సెంచరీ కొడుతారన్నారు. రాష్ట్రంలో 28 లక్షల మోటర్లు ఉన్న రైతులు కేసీఆర్‌ను కాదని ఇతర పార్టీలకు ఓటు వేయరన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఇప్పటి వరకు సర్పంచి కూడా కాలేదు. రాష్ట్రంలో గెలిచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీలు గెలిస్తే అభివృద్ధి జరగదన్నారు. సునీతా రెడ్డిని ఎమ్మెల్యే చేయండి, మదన్ రెడ్డిని ఎంపీ చేసే బాధ్యత నాది అని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement