Sunday, April 28, 2024

Icet Results: మధ్యాహ్నం 3 గంటలకు

ఇవాళ మధ్యహ్నం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరఫున ఐసెట్‌ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ ఆగస్టు 19, 20వ తేదీల్లో నిర్వహించింది. పరీక్ష ఫలితాలను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వర్సిటీ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ icet.tsche.ac.inను చూడవచ్చు. గత నెల 19, 20 తేదీల్లో ఆఫ్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్షకు 56,962 మంది విద్యార్థులు హాజరయ్యారు. 200 మార్కులకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 25 శాతం మార్కులు సాధిస్తే అర్హత సాధించినట్లుగా గుర్తిస్తారు. అంటే కనీసం 50 మార్కులు సాధించాలన్నమాట.

ఇది కూడా చదవండి: బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు ..!

Advertisement

తాజా వార్తలు

Advertisement