Monday, April 29, 2024

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాల‌కు కుంగిపోం..మ‌ధుయాష్కీ..

తెలంగాణ‌లో ఎప్ప‌టికీ బిజెపితో పొత్తు ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మ‌ధుయాష్కీ. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితంతో మేం కుంగిపోమ‌ని స్ప‌ష్టం చేశారు. కాగా హుజూరాబాద్ ఓట‌మి కార‌ణాల‌పై కాంగ్రెస్ క‌మిటీ వేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఓట‌మి కార‌ణంపై త్వ‌ర‌గా నివేదిక ఇవ్వాల‌ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కోరారు. ఈ క‌మిటీ అంతా రాసాభాస‌గా మారిన సంగ‌తి తెలిసిందే. జానారెడ్డి..వీ హ‌నుమంత‌రావు..గీతారెడ్డి త‌దిత‌రులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement