Monday, April 29, 2024

భార్య జననేంద్రియాలను కుట్టేసిన శాడిస్ట్ భర్త

మధ్యప్రదేశ్‌లో ఓ భర్త కర్కశంగా ప్రవర్తించాడు. భార్య‌పై అనుమానం పెంచుకున్న అతడు భార్య జ‌న‌నేంద్రియాల‌ను కుట్టేసి పారిపోయాడు. ఈ ఘటన సింగ్రౌలి జిల్లాలో వెలుగు చూసింది. రైలా గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి త‌న భార్య త‌న‌ను మోసం చేస్తుంద‌ని, మ‌రొక‌రితో సంబంధం పెట్టుకున్న‌ట్లు అనుమానించాడు. ఈ క్ర‌మంలో ఆమె జ‌న‌నేంద్రియాల‌ను కుట్టేశాడు. దీంతో బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

కాగా ప‌రారీలో ఉన్న తన భ‌ర్త‌ను ఏం చేయవద్ద‌ని, చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని భార్య పోలీసుల‌ను కోరింది. రెండు మంచి మాట‌లు చెప్పి పంపించాల‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతమైతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించి పంపించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది ఆమె. ప్ర‌స్తుతం బాధిత మ‌హిళ‌కు చికిత్స కొన‌సాగుతోంది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: ఆఫ్ఘన్‌లో దారుణ పరిస్థితి.. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటున్న ప్రజలు

Advertisement

తాజా వార్తలు

Advertisement