Sunday, April 28, 2024

National : యూపీలో బాణాసంచా ప‌రిశ్ర‌మ‌లో భారీ పేలుడు… 5మంది మృతి…

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించిన ఘటన వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో దాదాపు 5 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఈ ఘటన జిల్లాలోని కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ పట్టణంలో చోటుచేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 10 మందిని రక్షించి ఫ్యాక్టరీ నుంచి బయటకు తీశారు. అందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో ఇంకా 8 మంది చిక్కుకుపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement