Monday, April 29, 2024

భాగ్యనగరంలో బ్లాక్ మనీ!

హైదరాబాద్ లో భారీగా బ్లాక్ మనీ బయటపడుతోంది. రెండు వారాల్లోనే రూ,3,200 కోట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఓ ఫార్మా కంపెనీతోపాటు రియల్ ఎస్టేట్ కంపెనీలో బ్లాక్ మనీని గుర్తించారు. 10 రోజుల క్రితం ఫార్మా కంపెనీలో సోదాలు చేయగా..రూ.2 వేల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీల గుర్తించారు. తాజా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలో బ్లాక్ మనీ లావాదేవీలను కనుగొన్నారు.

హైదరాబాద్ కు చెందిన స్పెట్రా, సన్ సిటీ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.700 కోట్ల బ్లాక్ మనీ లావాదేవీలు గుర్తించారు. బ్లాక్ మనీ లావాదేవీల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేసుకున్నాయి కంపెనీలు. యాదాద్రి తదితర ప్రాంతాల్లో భారీగా వెంచర్లు వేశాయి. రెండు కంపెనీలు వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి. దీంతో కంపెనీల లావాదేవీలను ఐటీ అధికారులు సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement