Friday, May 3, 2024

TS | దళపతి వస్తున్నాడు.. కేసీఆర్​ రాక కోసం భారీ ఏర్పట్లు

యాదాద్రి (ప్రభన్యూస్ ప్రతినిధి) : యాదాద్రి జిల్లాలో హ్యాట్రిక్ ఎన్నికల సమర శంఖారావం పూరించడానికి గులాబీ దళపతి అడుగిడబోతున్నారు… రాష్ట్రంలోనే మూడవ సభగా, ఉమ్మడి నల్గొండలోనే తొలి సభను ఏర్పటు చేయడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ రెట్టింపు అయ్యింది.. సీఎం కేసీఆర్ పాల్గొనే తొలి సభను విజయవంతం చేయడం ద్వారా ప్రతి పక్షాలకు ఎన్నికల పోరుకు సవాల్ విసరాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు..

హ్యాట్రిక్ దిశగా అడుగులు

భారాస పార్టీ మూడోసారి అధికారం చేపట్టేందుకు ప్రజా ఆశీర్వాద సభలతో భారీ జన సమీకరణతో హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది.. హుస్నాబాద్ సభ తొలిది కాగా, ఆరోజే అభ్యర్థులకు బీ- ఫామ్ లను అందించనున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ మూడోది కాగా ఉమ్మడి నల్గొండలో తొలి సభ కానుంది..భువనగిరి ఎమ్మెల్యేగా ఇప్పటికే రెండు సార్లు గెలుపొందిన పైళ్ల శేఖర్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ సాధించేందుకు క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు.

బహిరంగ సభకు సర్వం సిద్ధం

- Advertisement -

సీఎం కేసీఆర్ భువనగిరిలో ఈ నెల 16న నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సర్వం సిద్ధం చేస్తున్నారు. భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో భారీ సభకు స్టేజి, తాగునీటి సౌకర్యం, వాహనాల పార్కింగ్, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తున్నారు. ఇప్పటికే ముఖ్యనాయకుల సమావేశాలు పెట్టి 50 వేల మందితో సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరికి బాధ్యతలను ఇస్తూ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement