Thursday, April 25, 2024

హిమాచల్ సీఎంతో గిడుగు భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కలిసి అభినందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న హిమాచల్ ముఖ్యమంత్రిని శనివారం ఢిల్లీలోని హిమాచల్ భవన్‌లో కలిశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సుఖును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతేకాదు, త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన చేపట్టాలని ఆయన్ను గిడుగు ఆహ్వానించారు.

సమావేశం అనంతరం గిడుగు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త కార్యక్రమాల్లో సుఖ్వీందర్ సింగ్ సుఖు పాల్గొని తనతో పాటు కలిసి పనిచేశారని గుర్తుచేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజారంజక పాలన అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజాకర్షక విధానాలు, ఎన్నికల్లో అక్కడి విజయం, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలసికట్టుగా ముందుకెళ్తామని గిడుగు రుద్రరాజు అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement