Monday, April 29, 2024

Breaking: AOB లో పోలీసుల హై అలర్ట్

ఒడిశాలో మావోయిస్టుల దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో (AOB) లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. మంగళవారం ఒడిశాలోని నౌపాడ జిల్లా బోడెన్ బ్లాక్‌లో సీఆర్పీఎఫ్ జ‌వాన్లపై మావోయిస్టులు కాల్పుల‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ముగ్గురు జ‌వాన్లు మృతి చెందారు. మ‌రో ఏడుగురు జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు.
కటాఫ్‌ ఏరియా, సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement