Monday, April 29, 2024

పాకిస్తాన్ లో ఘోర రైలు ప్ర‌మాదం – 25 మంది దుర్మ‌ర‌ణం

క‌రాచీ – పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హజారా ఎక్స్ ప్రెస్ కు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 25 మంది మృతి చెందారు. 80 మందికి పైగా గాయపడ్డారు. హజారా ఎక్స్ ప్రెస్ కరాచీ నుంచి రావల్పిండి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. షాజాద్ పూర్, నవాబ్ షా ప్రాంతాల మధ్య షహారా రైల్వే స్టేషన్ కు సమీపానికి రాగానే రైలు పట్టాలు తప్పింది.

కాగా, పట్టాలు తప్పిన బోగీల్లో చాలామంది చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని భ‌య‌ప‌డుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement