Wednesday, May 1, 2024

గురుకుల పాఠశాలలో – విద్యార్థి అనుమానాస్పద మృతి

మద్నూర్ : కామారెడ్డి జిల్లాలో ఓ గురుకుల పాఠ‌శాల విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. మ‌ద్నూర్ మండ‌లం ఎక్లార గేట్ స‌మీపంలోని సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫ‌స్ట్ ఇయర్ చదువుతున్న శిరీష(17 )అనే విద్యార్థిని పాఠశాల గ్రౌండ్ లో ఉన్న నీటి టాంకు లో ప‌డి ప‌డి అనుమానాస్పదంగా మృతి చెందింది, నిజాంసాగర్ మండలంలోని మాగ్దుంపూర్ కి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉంటున్నట్టు స‌మాచారం. సదరు విద్యార్థినీ తన‌కు ఇంట్లో గాని పాఠశాలల్లో గాని విలువ లేదని, ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేద‌న‌తో లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది, విద్యాలయ నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉందని , విద్యార్థులు పట్ల వ్యక్తి గత శ్రద్ధ లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతి పట్ల విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement