Monday, April 29, 2024

ADB: గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ: విప్ బాల్క సుమన్

చెన్నూర్, ఆంధ్రప్రభ: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం, ఇల్లు నిర్మించుకోవాలనే సదుద్దేశంతో రూ.3లక్షలు అందించే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

కేవలం రాజకీయ లబ్ది పొందేందుకు విపక్షాలు పథకంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు విపక్షాలు చేసే విష ప్రచారాలు నమ్మవద్దని కోరారు. గృహలక్ష్మి పథకం నిరంతరం కొనసాగుతుందని అర్హులైన నిరుపేదలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు సమయం ముగిసిందనే అసత్య ప్రచారాలను నమ్మకుండా మీ ప్రాంత ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లా కలెక్టర్ కు మీ దరఖాస్తులను అందజేయాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement