Monday, April 29, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న- న‌టి ప్రాంతిక‌

సినీ న‌టి ప్రాంతిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది. రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో సినీ నటి ప్రాంతిక పాల్గొంది. ప్రశాసన్‌ నగర్‌లో మంగళవారం ప్రాంతిక మొక్కలు నాటారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడడం సంతోషంగా ఉందన్న ప్రాంతిక.. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మనమే ప్రకృతిని కాపాడుకోవాలని, అందరు అడవులను సంరక్షించే బాధ్యత చేపట్టాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement