Tuesday, April 16, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన బిగ్ బాస్ ఫేమ్ స‌ర‌యు

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో బిగ్ బాస్ ఫేమ్, 7 ఆర్ట్స్ సరయు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సరయు మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటితే రాబోయే జనరేషన్ లో అక్షిజన్ కొనుక్కునే పరిస్థితి రాదన్నారు. పర్యావరణ పరిరక్షణ మనంద‌రి బాధ్యత అని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేసి.. అనంతరం 7 ఆర్ట్స్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కుమారి 21F డైరెక్టర్ సూర్య ప్రతాప్, బిగ్ బాస్ విశ్వ ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement