Thursday, April 25, 2024

గౌడ కుల‌స్థులు ఆర్థికంగా రాజ‌కీయంగా ఎద‌గాలి

గౌడ కుల‌స్థులు ఆర్థికంగా,రాజ‌కీయంగా ఎద‌గాల‌ని శ్రీ‌నివాస్ గౌడ్ అన్నారు. సోమ‌వారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో రంగనాయక స్వామి దేవాలయం ఆవరణలో గౌడ సంఘం కుటుంబ స‌భ్యుల స‌మావేశం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గౌడ కుల‌స్తుల కోసం గౌడ బీమా ఏర్పాటు చేయాల‌న్నారు. తాటి చెట్టు పై నుంచి పడి మరణించిన కుటుంబానికి రూ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ,అంగవైకల్యం పొందిన వారికి రూ. ఐదు లక్షలు ఇవ్వాలని గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 1000 కోట్ల నిధులు ఇవ్వాలన్నారు.
శ్రీరంగాపూర్ గౌడ సంఘం ఏకగ్రీవ ఎన్నిక
శ్రీరంగాపూర్ జిల్లా గౌరవ అధ్యక్షులు అల్వాల నర్సనుగౌడు శ్రీరంగాపూర్ గౌడ సంఘం అధ్యక్షుడిగా నిరుగంటి వెంకటేష్ గౌడ్ కంబాలాపూర్,గౌడ సంఘం ఉపాధ్యక్షుడు,నిరుగంటి బాల గౌడ్ తాటిపాముల, ప్రధాన కార్యదర్శి ఎస్ రామన్ గౌడ్, వెంకటాపూర్, కోశాధికారి,ఎస్. మేఘనాథ్ గౌడ్ జానంపేట ,కార్యవర్గ సభ్యులు ఎల్ వెంకటయ్య గౌడ్ షేర్ పల్లి, రామన్ గౌడ్ నాగారాల ,మన్యం గౌడ్ నాగసానిపల్లె, పి రాజా గౌడ్ తాటిపాముల ,నరేందర్ గౌడ్ నాగరాల ,ఎస్ శ్రీనివాస్ గౌడ్ వెంకటాపురం బి.రామన్ గౌడ్ శేరుపల్లి ,సభ్యులు ఏకగ్రీవంగా ఎన్న‌కున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement