Wednesday, May 1, 2024

TS | 76 లక్షల విలువైన బంగారం.. 3 లక్షల విలువైన వెండి స్వాధీనం

సూర్యాపేట (రూరల్‌) : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మండల పరిధిలోని టేకుమట్ల వద్ద రూరల్ సీఐ వై.సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న బొలెరో వాహనంలో 1135 గ్రాముల బంగారం, 17.99 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 76 లక్షలు, వెండి విలువ రూ. 13 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, స్వాధీనం చేసుకున్న‌ బంగారం, వెండిని ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ బాలునాయక్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement