Monday, March 18, 2024

స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా పెరిగిన వెండి ధర

బుధవారం నాడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 317 తగ్గి రూ.46,382కు చేరుకుంది. అటు ఎప్పుడూ బంగారం ధరతోపాటే పయనించే వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కిలోకు ఏకంగా రూ.2,328 పెరిగి రూ. 70,270కి ఎగబాకింది. దేశంలో బంగారం ధర క్షీణతకు అంతర్జాతీయ ధరల్లో ఒడిదొడుకులే కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1776 డాలర్లుగా ట్రేడవగా, వెండి ధర 26.42 డాలర్లుగా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 48,350గా ఉండగా, వెండి కిలో రూ.73,890గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement