Friday, May 17, 2024

National | అక్కడ గోబీ మంచూరియా, పీచు మిఠాయి నిషేదం

గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ రెండు ఆహార పదార్థాల విక్రయాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కృత్రిమ రంగుల వాడకం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ తో తయారు చేసిన గోబీ మంచూరియా, పీచు మిఠాయిలపై నిషేధం విధించారు. వీటిలో రంగులకు వాడే రోడమైన్-బి అనే రసాయనం ఆరోగ్యానికి హానికరమ‌ని.. అందుకే రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ తీసుకున్నట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement