Monday, April 29, 2024

Delhi: పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పిన గౌతమ్ గంభీర్

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పార్లమెంట్ ఎన్నికల వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాలిటిక్స్ ను తప్పుకున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పొలిటికల్ డ్యూటీల నుంచి తనకు రిలీవ్ ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కోరారు.

ఇప్పటికే క్రికెట్‌లో కమిట్ మెంట్ ఇచ్చిన టోర్నమెంట్ లపై ఫోకస్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక, గౌతీ తూర్పు ఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 మార్చి 22న అరుణ్ జైట్లీ, రవి శంకర్ ప్రసాద్ సమక్షంలో గంభీర్ బీజేపీలో చేరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement