Saturday, May 18, 2024

మ‌రో కొత్త అధ్యాయం దిశ‌గా గంగూలీ.. బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్న క్రికెట‌ర్‌..

తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నా… సమాజంలో ఎందరికో ఉపయోగపడే ఓ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు. ”1992లో ప్రారంభమైన నా క్రికెట్‌ కెరీర్‌ 2022తో 30ఏళ్లు పూర్తి చేసుకున్నా… నాటి నుంచి క్రికెట్‌ నాకెంతో ఇచ్చింది. మరీ ముఖ్యంగా మీ మద్దతును నాకు అందించింది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి నాకు సహకరించిన, నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎందరికో ఉపయోగపడే ఓ పని ప్రారంభించాలని ఈ రోజు నిర్ణయించుకున్నా…

నా జీవితంలో ఈ సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న వేళ మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా” అని గంగూలీ పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో దాదా వ్యాఖ్యలు హాట్‌టాఫిక్‌గా మారాయి. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని కొందరు, లేదని మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో రెండుసార్లు దాదా భేటీ కావడం కూడా చర్చకు వచ్చింది. దీంతోనే గంగూలీ బీజేపీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement