విషవాయువులను పీల్చడంతో నలుగురు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బహదూర్ఘర్లోని రోహాద్ ఫ్యాక్టరీ ప్రాంతంలో విష వాయువు కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతులంతా ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. ఫ్యాక్టరీలోని ఓ రసాయన నీటిని నిల్వ చేసిన ట్యాంకులోకి శుభ్రం చేసేందుకు నలుగురు దిగగా.. విష వాయువులను పీల్చడంతో మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు అందులోకి దిగి స్పృహ కోల్పోయారు. వారందరినీ బయటకు తీయగా.. నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement