Friday, May 17, 2024

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కి-సీబీఐ స‌మ‌న్లు

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కి సీబీఐ అధికారులు స‌మ‌న్లు జారీ చేశారు. న్యాయ వ్య‌వ‌స్థ‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో బుధ‌వారం త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని స‌ద‌రు స‌మ‌న్ల‌లో ఆమంచిని సీబీఐ అధికారులు ఆదేశించారు. ఈ కేసులో ఇప్ప‌టికే ఆమంచి ఓ ద‌ఫా సీబీఐ అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌రైయ్యారు. విశాఖ‌లోని సీబీఐ కార్యాల‌యంలో ఈ విచార‌ణ సాగింది.తాజాగా విజ‌య‌వాడ‌లోని సీబీఐ కార్యాల‌యంలో రేప‌టి విచార‌ణ జ‌ర‌గ‌నుంది. బుధ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సీబీఐ అధికారులు ఆమంచిని కోరారు. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌పై ఏపీ హైకోర్టు వ‌రుస‌గా వ్య‌తిరేక తీర్పులు వెలువ‌రించిన నేప‌థ్యంలో వైసీపీకి చెందిన ప‌లువురు సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు హైకోర్టు న్యాయ‌మూర్తులు, న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా ప‌లు కామెంట్లు చేశారు. ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టు ఆదేశాల‌తో సీబీఐ అధికారులు కేసులు న‌మోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement