Friday, May 3, 2024

Floods – ఉత్తరాఖాండ్‌లో భారీ వర్షాలు – కేదార్‌నాథ్‌ యాత్రకు బ్రేక్

ఉత్తరాఖాండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత అధికమయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రసిద్ధ కేదార్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యాత్రకు అనుమతించొద్దని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి అదేశించారు.

ఇప్పటికే బయల్దేరి వెళ్తున్న యాత్రికులను సోన్‌ప్రయాగ వద్ద నిలిపివేశారు. వారు తలదాచుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ మయూర్‌ దీక్షిత్‌ తెలిపారు .మరోవైపు రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రాన్ని సీఎం పుష్కర్‌ సింగ్‌ధామి అకస్మాత్తుగా సందర్శించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సన్నద్ధతపై ఆరా తీశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement