Monday, April 29, 2024

గబ్బిలం కలకలం..ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం..

ఢిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్ వెళుతున్న ఓ విమానంలో గబ్బిలం కలకలం సృష్టించింది. క్యాబిన్లో గబ్బిలం కనిపించడంతో విమానాన్ని తిరిగి ఢిల్లీ తీసుకొచ్చారు. క్యాబిన్లో గబ్బిలం విషయాన్ని విమాన పైలెట్ ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు తెలపడంతో, వారు తిరిగి రావాలని సూచించారు. దాంతో, టేకాఫ్ తీసుకున్న 30 నిమిషాలకే ఎయిరిండియా బోయింగ్ 737 విమానం ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగొచ్చింది. గబ్బిలంపై వన్యప్రాణి విభాగం వారికి సమాచారం అందించగా, వారు వచ్చి పరిశీలించేసరికి అది బిజినెస్ క్లాస్ క్యాబిన్లో చచ్చిపోయిన స్థితిలో కనిపించింది. ఆపై ప్రయాణికులను దింపివేసి విమానాన్ని శుద్ధి చేశారు. ప్రయాణికులను మరో విమానంలో అమెరికా పంపించారు. విమానంలో గబ్బిలాల వంటి సరీసృపాలు ప్రవేశించడం సాధారణమైన విషయమేనని, క్యాటరింగ్ వంటి ఇతర సర్వీసుల ద్వారా అవి విమానంలోకి వస్తుంటాయని ఎయిరిండియా అధికారి ఒకరు వెల్లడించారు.

https://twitter.com/disclosetv/status/1398596231149015041
Advertisement

తాజా వార్తలు

Advertisement