Monday, April 29, 2024

బీహార్ – కైమూర్ లో విషాదం…ఈత‌కు దిగిన అయిదుగురు చిన్నారులు దుర్మ‌ర‌ణం

బీహార్‌లోని కైమూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో స్నానానికి దిగి ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు బాలురు ఉండగా..ఒక అమ్మాయి ఉంది. స్థానికులు చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దు:ఖ సాగరంలో నిండిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన పిల్లలందరి వయస్సు 7 నుండి 12 సంవత్సరాలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన పిల్లలను ధావ్‌పోఖర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. ఉపాధ్యాయుడు సుశీల్ రామ్‌కు చెందిన 12 ఏళ్ల అను ప్రియ, 10 ఏళ్ల అన్షు ప్రియ, 8 ఏళ్ల మధుగా గుర్తించారు. మరొకరు సునీల్ రామ్ కూతురు 4 ఏళ్ల అపూర్వ కుమారి, ఓ ఉపాధ్యాయురాలి 4 ఏళ్ల కుమారుడిగా గుర్తించారు. ఇదిలా ఉంటే మరో ముగ్గురు చిన్నారులను అక్కడి స్థానికులు కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కరంచత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధవ్ పోఖర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement