Wednesday, May 1, 2024

వెలుగోడు రిజర్వాయర్ లో.. గల్లంతైన 350ఆవులను రక్షించిన జాలర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ లో కొట్టుకుపోతున్న 350 ఆవులను జాలర్లు రక్షించారు. వెలుగోడు సమీపంలో మేతకు వెళ్లిన 500 ఆవులను సమీప అడవిపందులు వెంటపడి తరిమాయి. దీంతో ఆవులన్ని వెలుగోడు రిజర్వాయర్ లోకి దిగాయి. నీటి ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోతుండగా గమనించిన గ్రామస్థులు, జాలర్లు 350 ఆవులను రక్షించారు. అయితే మరో 150 ఆవుల కోసం మరబుట్టలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement